RS Praveen Kumar: ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ జర్నీపై నేడు క్లారిటీ రానుందని అంటున్నారు. ప్రజా సేవ కోసం ఐపీఎస్ సర్వీసు వదులుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీలో చేరడం ఖాయమైన సంగతి తెలిసిందే. నేడు ఆయన బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్తా తేలిపోతుందని చెప్తున్నారు.
Read More: RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ను కేసీఆర్ టార్గెట్ చేశారా… రోజులు దగ్గర పడ్డాయి అంటూ…
బీఎస్పీలో చేరికపై…
బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ ట్విట్టర్లో ఈ నెల 8న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుపుతూ స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి రిట్వీట్ చేశారు. దీంతో ఆయన బీఎస్పీలో చేరుతుండటం ఖరారైనట్టే అని అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని అంటున్నారు. ఇటీవల జరిపిన వివిధ ప్రాంతాల పర్యటనలో ఈ విషయం స్పష్టమైందని చెప్తున్నారు. బహుజన ప్రభుత్వం ఏర్పడాలన్న నినాదంతో ముందుకు సాగుతున్న ఆయనకు నేడు పొందే మద్దతు ద్వారా ప్రజల్లో ఉన్న మద్దతు అంచనా వేయవచ్చని చెప్తున్నారు.
Read More : RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ను కేసీఆర్ టార్గెట్ చేశారా… రోజులు దగ్గర పడ్డాయి అంటూ…
ఇప్పటికే ప్రభుత్వంపై…
కాగా ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై దూకుడుగా స్పందిస్తున్నారు.తాను పాల్గొన్న సభలలో.. తాను మాట్లాడే సమయంలోనే కావాలనే పవర్ కట్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. అదేవిధంగా తనతో మాట్లాడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.