RS Praveenkumar: తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ బహుజన సమాజ్వాదీ పార్టీ (BSP)లో చేరుతున్నట్టు క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనతో పాటుగా మరో అధికారి సైతం బీఎస్పీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గురించే ఈ ప్రచారం. గత మూడ్రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఈ కామెంట్లపై స్పందించారు.
Read More : RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ టార్గెట్ కేసీఆర్యేనా? ఆ మాటల అర్థం అదే కదా?
ప్రచారం ఇది…
మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బాటలోనే మాజీ ఐఏఎస్ అధికారి మురళి నడుస్తారంటూ పెద్ద ఎత్తున కథనాలు రావడంపై ఎట్టకేలకు ఆయన స్పందించి ఈ ప్రచారానికి పుల్స్టాప్ పెట్టారు. తాను బీఎస్పీలో చేరబోవడం లేదంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రసార, సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా జరిగిన ప్రచారం అంతా తప్పు అని.. దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఆకునూరి మురళి ఇచ్చిన క్లారిటీతో అయినా ఈ ప్రచారానికి చెక్ పడుతుందేమో చూడాలి మరి.
Read More: KCR: గవర్నర్ నరసింహన్ కేసీఆర్కు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
ఆర్ఎస్ ప్రవీణ్ సంగతేంటంటే…
ఆర్ఎస్ ప్రవీణ్ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేరును ప్రస్తావిస్తూ పలు వర్గాలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, ప్రవీణ్ ఇప్పటికే తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. వివిధ స్కీంలను తప్పుపడుతున్నారు. ప్రభుత్వ పథకాలను లోతుగా విశ్లేషిస్తూ బహుజనుల ప్రభుత్వం ఏర్పాటు కావాలంటూ నినదిస్తున్నారు.