వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజుతో కలిసి తెరకెక్కించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. దివంగత నేత ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో.. ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పుడు జరిగిన రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో సినిమా పలు వివాదాలకు కారణంగా మారింది. సినిమా విడుదల కానీయకుండా కేసులు కూడా వేశారు. ఎన్నికల సమయంలో సినిమా ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎన్నికల కమీషన్కు పిర్యాదులు కూడా వెళ్లాయి.
కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందు హాజరు కావాలని ఈసీ నిర్మాత రాకేష్ రెడ్డిని కోరింది. నిర్మాత రాకేష్ రెడ్డి కమిటీ ముందు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “సినిమాకు సంబంధించిన అంశాలను ఈసీ స్పెషల్ కమిటీకి వివరించాం. వారు మా సమాధానాలతో సంతృప్తి చెందారు. విడుదలకు అంగీకారం తెలిపారు. విడుదల తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ హాజరు కావాలని కూడా సూచించారు. ఈ సినిమాను లక్ష్మీ పార్వతిగారు రాసిన పుస్తకం ఆధారంగానే తీశాం. జగన్ తమ పార్టీ అధినేతే కానీ.. ఆయనతో నాకు బంధుత్వం లేదు“ అన్నారు.
ఈసీ క్లియరెన్స్ దక్కడంతో `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!