Amith Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం ఏపి పర్యటనకు విచ్చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్నను అమిత్ షా దర్శించుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఢిల్లీ నుండి విమానంలో అమిత్ షా బెంగళూరుకు రానున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో అమిత్ షా కుటుంబం శ్రీశైలం ఆలయానికి చేరుకోనున్నారు. అమిత్ షా కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏపి బీజేపీ నేతలు సిద్ధం అవుతున్నారు.
గత కొద్ది రోజులుగా పలువురు మంత్రులు కేంద్రంలోని బీజేపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తుందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన జరగడం, ఆ వెంటనే అమిత్ షా రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.