Tirumala: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపికి వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేడు తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ ఓం బిర్లాకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఇఓ డాక్టర్ కెఎస్ జవహర్, అదనపు ఇఓ ఎవి ధర్మారెడ్డి, సీవిఎస్వో గోపీనాథ్ జెట్టి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ముందుగా స్పీకర్ ఓంబిర్లా ధర్మస్తంభానికి నమస్కరించి తరువా మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనాననంతరం రంగనాయక మండలంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈఓలు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ లను స్పీకర్ కు అందించారు.
కార్యక్రమంలో వైసీపీ ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్ రెడ్డి, హరినారాయణన్, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆలయ డీప్యూటి ఇఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.