Afghanisthan Taliban’s: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆఫ్గనిస్థాన్ దేశంలో తాలిబాన్లు చేస్తున్న వికృత చేష్టలు పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. ఆ దేశంలో ఎప్పుడైతే అమెరికా నాటో దళాలు వెనక్కి వెళ్లడం ప్రారంభించాయో… అప్పటి నుండి తాలిబాన్లు అక్కడి ప్రభుత్వం పై అదే రీతిలో ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం స్టార్ట్ చేశారు. చాలా ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకుంటూ తిరగబడుతున్న ప్రజలపై ఎక్కడికక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ మహిళలపై భారీగా అత్యాచారాలకు పాల్పడి వారిని గతంలో మాదిరిగా హింసలకు గురి చేస్తున్నారు.
దాదాపు ఇరవై సంవత్సరాలు అధికారానికి దూరం అవటంతో తాలిబాన్లు మళ్లీ తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దాదాపుగా కూల్చే రీతిలో.. దేశంలో చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో తాలిబాన్లు చేతిలోకి దేశం వెళితే మళ్లీ వస్తాయని దేశంలో చాలా మంది ప్రజలు దేశాన్ని విడిచి వెళ్ళటానికి అనేక మార్గాలు అన్వేషిస్తూ విమాన రెక్కలపై ఇంకా చాలా రకాలుగా సరిహద్దులు దాటి పారిపోతున్నారు. ముఖ్యంగా విమాన రెక్కలపై ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫోటోలు సోషల్ మీడియాలో అందరి మనసులను కలచివేస్తోంది.
ఇటువంటి తరుణంలో సమాజంలో జరిగే చాలా విషయాల గురించి స్పందించే కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆఫ్గనిస్థాన్ దేశంలో తాలిబాన్లు వ్యవహరిస్తున్న తీరుపై రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో చిన్నపిల్లలు ఎలక్ట్రానిక్ కార్లపై తాలిబాన్లు ఆడుకోవడం వీడియో ఇంకా అదే రీతిలో పలు చోట్ల గన్స్ పట్టుకుని నిలబడటం వంటి ఫోటోలను పోస్ట్ చేసి తాలిబాన్లు జంతువులు లాంటి వారిని.. అంత మాత్రమే కాక వాళ్ళు చిన్న పిల్లలు అంటూ.. తాలిబన్లపై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.