Anasuya: యాంకర్ అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి అయినా గాని బుల్లి తెరపై తిరుగులేని క్రేజ్ కలిగిన అనసూయ.. కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇస్తూ మరోపక్క సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. అంతే కాకుండా ఇటీవల “మా” (MAA)అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కాగా సోషల్ మీడియాలో అనసూయ(Anasuya) చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సమాజంలో జరిగే అనేక విషయాలు గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఉంటది. ఇటువంటి తరుణంలో తాజాగా మంత్రి కేటీఆర్(KTR) నీ… సోషల్ మీడియా వేదికగా అనసూయ ప్రశ్నించడం జరిగింది.
విషయంలోకి వెళితే ట్విటర్లో అనసూయ కేటీఆర్(KTR) కి.. చిన్నపాటి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లో ఏముందంటే…” కేటీఆర్ గారు అసలు లాక్డౌన్(Lock Down) ఎందుకు వచ్చింది ఆ తర్వాత అన్ లాక్ కూడా ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. పెద్ద వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో భరోసా ఇవ్వవచ్చు. అయితే టీకా వేసుకోవడానికి అర్హత ఉన్న వయసు కంటే తక్కువ వయసు కలిగిన చిన్న పిల్లల పరిస్థితి ఏంటి సార్..?? పాఠశాలలు పిల్లల తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నారు సార్ అని అనసూయ ప్రశ్నించింది. అంతమాత్రమే కాకుండా పాఠశాలలకు పిల్లలను పంపించగా అక్కడ.. ఉన్న స్కూల్ యాజమాన్యాలు పిల్లల ఆరోగ్యానికి ఏదైనా అయితే తమకు సంబంధం లేదని ముందుగానే.. తల్లిదండ్రుల వద్ద సంతకాలు చేయించి కుంటున్నాయి.
చిన్నపిల్లలకు ఇంకా అందుబాటులోకి రాలేదు
ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి సార్..? ఇలాంటి విషయాల్లో మీరు ఎప్పటిలాగానే సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్విట్టర్ లో అనసూయ మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించింది. కరోనా మళ్లీ విజృంభించే అవకాశలు.. ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలో పాఠశాలలో ఓపెన్ అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం పెద్ద వారికి అయినా గాని చిన్నపిల్లలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో చాలావరకు ఒక అనసూయ మాత్రమే కాక పిల్లల తల్లిదండ్రులు పాఠశాలలు తెరవటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.