Old tyres: నైజీరియాలో ఉండే మహిళా పారిశ్రామిక వేత్త చొరవతో అక్కడ పాత టైర్లకు మస్తు గిరాకీ ఏర్పడింది. అసలు పాత టైర్లను ఏం చేస్తారని అందరూ ఆలోచిస్తుండగా… ఆ పారిశ్రామిక వేత్త ఏం చెప్పిందనే విషయాన్ని ఒక్క సారి గమనిద్దాం…
Airtel: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ప్లాన్తో రీచార్జ్ చేస్తే ఉచితంగా..
ఇఫిడేలాపో రాన్ సేవే…
నైజీరియన్ల స్థితిని మార్చిన ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్త ఇఫిడేలాపో రాన్ సేవే. ఈమె నూతన కంపెనీని స్థాపించి నైజీరియన్ల స్థితి గతులను మార్చేసింది. ఈమె మొదట పాత టైర్లను రీసైక్లింగ్ చేసే కంపెనీని స్థాపించినపుడు కేవం ఇద్దరంటే ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కంపెనీ కూడా ఒక మామూలు షెడ్ లో ప్రారంభమయింది. ఇలా పాత టైర్లను సేకరించి వారు రీసైక్లింగ్ చేసి వాటిని పేవ్ మెంట్ బ్రిక్స్ గా తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన బ్రిక్స్ ను చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు.
Besan Flour: శనగపిండి కల్తీ చేశారో లేదో ఇలా చెక్ చేయండి..!?
క్వాలిటీ రోడ్లు, పాఠశాలల ఆవరణల్లో…
ఇలా పాత టైర్లతో తయారు చేసిన పేవ్ మెంట్ బ్రిక్స్ ను ఉపయోగించి క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాలల ఆవరణల్లో వేస్తున్నారు. దీంతో ఆ బ్రిక్స్ కు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. చిన్నగా ప్రారంభమైన కంపెనీ కాస్త ఇప్పుడు పెద్ద కంపెనీలా మారిపోయింది. కొత్త మెషనరీని తీసుకొచ్చినా కానీ డిమాండ్ కు తగిన విధంగా సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నగా ప్రారంభమైన రేకుల షెడ్డు కాస్త ప్రస్తుతం 128 మందికి చేరుకుంది. రావ్ సేనే కంపెనీ పాత టైరుకు 15 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. దీంతో కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన అందరూ పాత టైర్ల వేటలో పడ్డారు. రాన్ సేవే మాట్లాడుతూ అవి పాత టైర్లు కావని బ్లాక్ గోల్డ్ అంటూ పేర్కొనడం విశేషం. రాన్ సేవే చేసే పని వలన పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.