Train journey: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే భారతీయ రైల్వే జనరల్ కోచ్లను ఏసీ కోచ్ లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, సుదూర ప్రాంతాలకు నడిచే రైలు బోగీలను మాత్రమే ఏసీ కోచ్లుగా మార్చనున్నట్టు ప్రకటించింది. ప్యాసింజర్స్ కు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం భారతీయ రైల్వే (railway) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఏసీ జనరల్ క్లాస్ కోచ్ల పేరుతో కొత్త బోగీలను తీసుకురానుంది.
IRCTC: మీరు త్వరలో ట్రైన్ ఎక్కాలి అనుకుంటున్నారా ఈ విషయం తెలుసుకొండి..!
ప్రతీ కోచ్లోనూ ఏసీ..
ప్రస్తుతం ఉన్న సూపర్ ఫాస్ట్ రైళ్ళలో (super fast trains) స్లీపర్ క్లాస్తో పాటు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి కోచ్లు ఉంటాయి.కానీ, రాబోయే రోజుల్లో ట్రెయిన్ బోగీలన్నీ ఏసీ కోచ్లుగా దర్శనం ఇవ్వనున్నాయని తెలుస్తోంది. సాధారణంగా జనరల్ టికెట్ ధర కంటే ఏసీ, స్లీపర్ టికెట్ ధరలు అధికంగా ఉంటాయి. కానీ, త్వరలో రానున్న జనరల్ ఏసీ కోచ్లలో ఇప్పుడున్న ధరలు మాత్రమే ఉంటాయని ఇండియన్ రైల్వే తెలిపింది.
Trains Timings changes : రైలు ప్రయాణికులకు అలర్ట్..!!
ఈ కోచ్లు ఎక్కడ తయారవుతున్నాయంటే..
ఇండియన్ రైల్వే ఒక్క బోగిలో వంద నుంచి రెండు మంది సీటింగ్ కెపాసిటీతో బోగిలను తయారు చేస్తుంది. అయితే, త్వరలో రానున్న జనరల్ ఏసీ కోచ్లు పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో గల రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు కానున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ బోగిలోని సీట్లన్నీ ముందే రిజర్వ్డ్గా ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆటోమెటిక్ డోర్స్ సిస్టమ్తో ఈ కోచ్ లు రానున్నాయి. గతంలో జనరల్ టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కేవారు. ఇప్పుడు టిక్కెట్ కన్ఫామ్ అయిన వారే ఎక్కాలి. స్లీపర్ క్లాస్ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ కోచ్లను తయారు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే 1700 రైలు ఈ జనరల్ ఏసీ కోచ్లతో పట్టాలెక్కనున్నాయి.