Acharya: మెగా మల్టీస్టారర్గా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ కొరటాల శివ మెగా ఫ్యాన్స్కు సూపర్ గుడ్ న్యూస్ చెప్పినట్టు ఇప్పుడు సొషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఆచార్య. ఇందులో చిరు, చరణ్ నక్సలైట్స్గా కనిపించబోతున్నారు. వచ్చేనెల 4వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. రచయితగా పాపులర్ అయిన కొరటాల శివ దర్శకుడిగా మారి మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ తీశారు.
ఇప్పుడు మెగా మల్టీస్టారర్గా రూపొందుతున్న ఆచార్య అంతకు మించి అనేట్టుగా కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త వచ్చి వైరల్ అవుతోంది. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు వాస్తవ సంఘటనలతో వచ్చిన సినిమాలు భారీ కమర్షియల్ సక్సెస్ సాధించాయి. అదే కోవలో ఆచార్య కూడా నిలుస్తుందని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒరిస్సాకు చెందిన సుబ్బారావు పాణి గ్రాహి అనే పోరాట వీరుడు జీవిత కథ ఆధారంగా చేసుకొని నవల లోని కొన్ని ప్రధాన అంశాలను మూలంగా చేసుకొని ఆచార్యను తెరకెక్కించారట.
Acharya: ఈ అంశాలన్నిటినీ ఆచార్యలో కొరటాల చూపించబోతున్నారట..!
ఒకప్పుడు శ్రీకాకులం ప్రాంతంలోని దేవాలయ భూములను ఆక్రమించడానికి కొందరు భూస్వాములు ప్రయత్నించగా సుబ్బారావు పాణి గ్రాహి అడ్డుకున్నారు. తన ధైర్యసాహసాలతో వాళ్లకి వ్యతిరేకంగా పోరాడారట. అంతేకాదు దేవాలయ భూములను కాపాడటానికి ఆయన చాలా కృషి చేశారు. ఆ సమయంలో ఇద్దరు నక్సలైట్లు తన పోరాటానికి అండగా నిలిచారు. ఆశయ సాధనకి తమవంతు సహాయ సహకారాలను అందించారట. ఈ అంశాలన్నిటినీ ఆచార్యలో కొరటాల చూపించబోతున్నారని, ఆ నక్సలైట్ పాత్రల్లోనే చిరంజీవి, చరణ్ నటించించారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ మెగా మల్టీస్టారర్ ఎలాంటి హిట్ సాధిస్తుందో.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!