Puspa: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమిటి “పుష్ప” మువీలో ఉన్నారు అనుకుంటున్నారా..నిజమే కానీ..ఆయన ఓ సన్నివేశం (నేరుగా కాదు)లో ప్రేక్షకులకు కనబడతారు. అది ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం “పుష్ప” గత నెల 17వ తేదీన విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మువీకి అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అయిన ఈ మువీకి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో విడుదల అయిన 20 రోజులు దాటక ముందే హిందీ వర్షన్ మినహా ఇతర భాషలకు సంబంధించిన సినిమా ఇప్పటికే డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.
Read More: BREAKING: హీరో గా సిద్ శ్రీరామ్ ! చాలా పెద్ద డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టాడు !
Puspa: పోలీస్ స్టేషన్ లో దర్శనమిచ్చిన చంద్రబాబు ఫోటో
పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. సాధారణంగా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తుంటారు. అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీన్లు, అలాగే పోలీస్ ఆఫీసర్ లు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తున్న సీన్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పోలీస్ స్టేషన్ గోడపై కనబడుతుంది. ఓటీటీలో “పుష్ప”ను చూసిన అభిమానులు తమ భావాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. “పుష్ప”లో చంద్రబాబు ఉన్నాడంటూ ఆ ఫోటో స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది.
రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. 1995 నుండి 2004 వరకూ దాదాపు 8 సంవత్సరాలకుపైగా ఏపిని పరిపాలించిన ఘనత చంద్రబాబుకు ఉంది. మరల రాష్ట్ర విభజన అనంతరం 2014 నుండి 2019వరకూ నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఘనత దక్కించుకున్నారు. ఈ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు చంద్రబాబు సర్కార్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ టాస్క్ ఫోర్స్ ను రద్దు చేసింది. అయితే జగన్ సర్కార్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టింది.