Sharwanand: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశిలు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ రోజు `భీమ్లా నాయక్` బరిలోకి దిగడంతో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రాన్ని మార్చి 4కు షిప్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే మేరక్స్ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి ముఖ్య అతిథులుగా విచ్చేయగా.. వారి చేత తాజాగా సినిమా ట్రైలర్ను విడుదల చేయించారు.
`ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే.. సెంటిమెంట్గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా, ఎప్పుడు వచ్చి చూస్తారు` అంటూ ఓ అమ్మాయి శర్వా గురించి చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం సూపర్ ఫన్నీగా సాగింది. పెళ్లి కోసం తంటాలు పడే యువకుడి పాత్రలో శర్వానంద్ నటించాడు.
ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళకి ఏ అమ్మాయి నచ్చకపోవడంతో శర్వానంద్ పెళ్లి వయసు దాటిపోతుంటుంది. ఆ టైమ్లో రష్మిక కనిపించడం, ఆమెతో శర్వా ప్రేమలో పడటం జరుగుతుంది. అయితే రష్మిక పెళ్లి మాత్రం చేసుకోనంటుంది. మరి శర్వా రష్మికను ఎలా మెప్పించాడు.? ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో ఉండే ఆడ గ్యాంగ్ను ఏ విధంగా ఒప్పించాడు..? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి తాజా ట్రైలర్ మాత్రం అదిరిపోవడమే కాదు.. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మరి దానిపై మీరు ఓ లుక్కేసేయండి.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!