Air Conditioner : కొన్ని రకాల సూచనలు :
ఎండలు బాగా పెరిగాయి. ఈ కారణం గా తీవ్రమైన వేడి తో పాటు ఉక్కపోతతో ఏసీల వాడకం పెరిగింది.దీంతో కరెంట్ బిల్లు కూడా బాగా పెరిగిపోతుంది. ఈ సమస్యను నివారించడానికి AC తయారీ సంస్థలకు BEE కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియచేసింది. ఏసీలలో డిఫాల్ట్ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వద్ద మాత్రమే ఉంచాలి అని సూచించింది. అలాగే ఏసీ లు వాడేవారు కొన్ని రకాల సూచనలు పాటిస్తే, కరెంట్ బిల్లు వేడి నుంచి కూడా కాస్త చల్లబడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
Air Conditioner : 24 డిగ్రీలు వద్ద ఉంచుకోవడం:
ఏసీ ఉష్ణోగ్రతను పెంచుతూ పోతే ప్రతి డిగ్రీకి ఇంచుమించుగా 6 శాతం వరకు కరెంట్ ఆదా చేసుకోవచ్చని ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో తెలిసింది. ఏసీ ఉష్ణోగ్రతను తగ్గించడం వలన దాని కంప్రెసర్లు ఎక్కువసేపు పనిచేయడం కోసం అధిక విద్యుత్ ను తీసుకుంటాయి. దీంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఏసీని డిఫాల్ట్ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు లో ఉంచండి. బయట ఉండే వేడికి అది చాలా బాగా పనిచేస్తుంది కూడా. అంత వేడిలో కూడా చలి వేసే విధం గా పెట్టుకుంటే కరెంటు బిల్లు మాట ఎలా ఉన్న ఆరోగ్యానికి ,చర్మానికి చాలా నష్టం జరుగుతుంది.
ఏసీ చల్లదనం ఎటునుండి:
పగలు ఉష్ణోగ్రత 34 నుంచి 38 డిగ్రీల మధ్య ఉంటుంది. డిఫాల్ట్ ఉష్ణోగ్రత 24 డిగ్రీలతో ఏసీ ఉంచితే బయటి వేడితో పోల్చుకంటే మనం ఇంటి ఉష్ణోగ్రతను 10 డిగ్రీల వరకు తగ్గించాము కాబట్టి వేడినుండి బయటపడినట్టే. మన శరీర ఉష్ణోగ్రత దాదాపున 36-37 డిగ్రీల మధ్య ఉంటుంది కాబట్టి అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏ గది అయినా మనకు చల్లగానే ఉంటుంది. కాబట్టి ఏసీని 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వలన కరెంట్ ఆదా అవుతుంది. అదే విధం గా ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఏసీ చల్లదనం ఎటునుండి బయటకు పోకుండా కిటికీలను, గది తలుపులు పూర్తిగా మూసివేసి కర్టెన్లను పూర్తిగా వేసేయడం వలన ఎండ వేడి గదిలోకి రాకుండా ఉంటుంది. అదే సమయంలో ఏసీ చల్లదనం నిలిచి ఉంటుంది. కరెంట్ కూడా సేవ్ అవుతుంది.