Radhey Shyam: “రాధేశ్యామ్” మార్చి 11 విడుదల అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆర్య అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన ప్రతి చోటా పరాజయం పాలు కావడం జరిగింది. దీంతో ప్రభాస్ క్రేజ్ ఉన్న కొద్దీ పడిపోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. బాలీవుడ్ లో అయితే కనీసం సినిమాకి అనుకున్నంత కూడా కలెక్షన్ రాలేదు. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ “రాధేశ్యమ్” పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సినిమాకి భారీ బడ్జెట్ పెట్టేసారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంత ఖర్చు అనవసరం. కథలో దమ్ముంటే చాలు.. ఆటోమేటిక్ గా జనాలకి ఎక్కేస్తాది. విజువల్ ఫీస్ట్ డామినేట్ చేస్తే… స్టోరీ చచ్చిపోద్ది. ఇదే బాలీవుడ్ సినిమా “కాశ్మీర్ ఫైల్స్” లో రోజులు అయ్యింది. కేవలం ఐదు కోట్లకు మించకుండా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్లు సాధించడం గమనార్హం అని అన్నారు. “రాధేశ్యమ్” కి పెట్టిన బడ్జెట్ వచ్చిన వసూలుకి ఎక్కడ పొంతన లేకుండా పోయిందని విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథ… డామినేట్ చెయ్యటం జరిగింది అని చెప్పుకొచ్చారు.
“రాధేశ్యామ్” 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. వీటిలో ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ఖర్చు చేసినట్లు టాక్. అంతమాత్రమే కాకుండా మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో..పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న క్రమంలో స్టోరీ చాలా స్లోగా ఉండటం సినిమాకి అతి పెద్ద మైనస్ అని జనాలు అంటున్నారు. చాలా దారుణంగా సినిమా ఫ్లాప్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకోవటం జరిగింది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!