NewsOrbit
న్యూస్

Ramya Murder Case: రమ్య హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష!తొమ్మిది నెలల్లోనే ముగిసిన ట్రయిల్!వర్క్ అవుట్ అయిన జగన్ “దిశ ఇన్షియేటివ్”!

Ramya Murder Case: ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్య కేసులో నిందితునికి మరణ శిక్ష పడడం కన్నా ఈ కేసులో కేవలం తొమ్మిది నెలల్లోనే తుది తీర్పు రావటం అనేది అభినందనీయమయిన విషయం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పేరిట అమలుచేస్తున్న కార్యక్రమం ఫలితంగానే ఇది సాధ్యపడిందన్నది వాస్తవం.సహజంగానే ఇది జగన్ సర్కారు ఇమేజ్ ని పెంచగలిగే విషయం.అందువల్లే ఈ తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు.హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

Death sentence for accused in Ramya murder case!
Death sentence for accused in Ramya murder case!

Ramya Murder Case: అసలేం జరిగిందంటే!

నల్లపు రమ్య అనే ఇంజినీరింగ్ విద్యార్థినిని ప్రేమించి భంగపడిన కుంచాల శశికృష్ణ అనే యువకుడు గుంటూరులో 2021 ఆగస్టు పదిహేనో తేదీన నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడు.సంచలనం రేపిన ఈ నేర ఘటన పై పోలీసులు తీవ్రంగా స్పందించారు.

Death sentence for accused in Ramya murder case!
Death sentence for accused in Ramya murder case!

పది గంటల్లో హంతకుడు పట్టివేత!

హతురాలి తండ్రి ఫిర్యాదు అందగానే పోలీసులు విస్తృత గాలింపు జరిపి కేవలం పది గంటల వ్యవధిలో నిందితుడిని నర్సరావు పేట సమీపంలో పట్టుకున్నారు.మారణాయుధాన్ని స్వాధీనపర్చుకున్నారు.ఇక డీఎన్ఏ రిపోర్టు కూడా కేవలం రెండు రోజుల వ్యవధిలో వచ్చేసింది.గతంలో డీఎన్ఏ రిపోర్ట్ రావటానికి నెలల తరబడి పట్టిన సందర్భాలు ఉన్నాయి.అన్ని సాక్ష్యాధారాలను క్రోడీకరించుకుని నిందితుడిపై వారం రోజుల లోపలే పోలీసులు చార్జిషీటు కూడా దాఖలు చేశారు.

Ramya Murder Case: జెట్ స్పీడ్ లో విచారణ!

ఇక ఈ కేసులో విచారణ గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి న గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రారంభమై శరవేగంతో సాగింది.మొత్తం ఇరవై ఎనిమిది మంది సాక్షులను విచారించారు.నిందితుడి సెల్ఫోన్ డేటాను, అతడు నేరానికి ఉపయోగించిన కత్తిని, వాహనాన్ని కూడా పరిశీలించారు. నాలుగు నెలల లోపలే విచారణ ముగిసింది.శుక్రవారం ఈ కేసులో నిందితుడు శశి కృష్ణకు మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును ఇచ్చారు.ఈ తీర్పుపై హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.ఇంత త్వరగా మరణ శిక్ష పడేంత కేసు తేలిపోవటం రాష్ట్ర చరిత్రలో ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు.

సీఎం జగన్ హర్షం!

ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఒక క్రూరమైన నేరంలో నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా చేసిన పోలీసు వ్యవస్థను ఆయన అభినందించారు.ఇదే విధంగా అన్ని కేసుల్లో కూడా పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?