Venkatesh: విక్టరీ వెంకటేష్.. ఆరు పదుల వయసులోనూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారీయన. `నారప్ప`, `దృశ్యం` చిత్రాలతో వరుస హిట్స్ను ఖాతాలో వేసుకున్న వెంకటేష్.. ఇటీవల `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రమిది.
ఇందులో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటంచగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వెంకటేష్ రానా దగ్గుబాటితో కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. బాబాయ్, అబ్బాయ్ వెండితెరపై కలిసి నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హాలీవుడ్ సిరీస్ రే డొనోవన్ ఆధారంగా రూపొందుతోన్న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా `కభీ ఈద్ కభీ దివాలీ` అనే మూవీ తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. అలాగే తాజాగా వెంకీని దర్శకుడు అనుదీప్ కెవీ లైన్ పెట్టాడట.
‘జాతిరత్నాలు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనుదీప్ కెవీ.. రీసెంట్గా ఓ కథను సిద్ధం చేసి వెంకీకి వినిపించారట. అది బాగా నచ్చడంతో.. వెంటనే వెంకటేష్ ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేట్ కూడా రానుందని టాక్ నడుస్తోంది. కాగా, అనుదీప్ కెవీ ప్రస్తుతం కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో `ప్రిన్స్` అనే మూవీ చేస్తున్నాడు.ఇదీ పూర్తైన వెంటనే వెంకీ, అనుదీప్ ల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని అంటున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!