Big Breaking: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే తను రాజీనామా ప్రకటించారు. ఉద్దవ్ ఠాక్రే ఫేస్ బుక్ లైవ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. విధాన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు శివసేన ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ శిందే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన క్యాంప్ పెట్టిన తరుణంలోనే ఉద్దవ్ ఠాక్రే సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేసి మాతోశ్రీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆరోజే రాజీనామా చేయడానికి సిద్ధమేనని కూడా ప్రకటించారు ఉద్దవ్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వారం రోజుల వ్యవధిలో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతూ వచ్చాయి. తొలుత శిందే శిబిరంలో 11 మంది ఉండగా అయిదు రోజుల వ్యవధిలో 50 మంది అయ్యారు. తొమ్మిది మంది మంత్రులు కూడా శిందే శిబిరానికి వెళ్లిపోయారు. రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయికి తిరిగి రావాలని ఉద్దవ్ ఠాక్రే పిలుపు ఇచ్చినా ఒక్కరూ స్పందించలేదు. ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపి నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ లు ముంబాయిలోని తాజ్ ప్రెసిడెన్సీ హోటల్ నందు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలు మిఠాయిలు తినిపించుకున్నారు.