తెలుగు సినిమా రంగం యొక్క స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అన్న సంగతి తెలిసింది. దానికి ముఖ్య కారణం దర్శకధీరుడు రాజ్యమౌళి. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి 2”, “RRR” రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా మన సౌత్ సినిమాలకు బాలీవుడ్ సినిమాలు పోటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దక్షిణాది సినిమా రంగాన్ని హేళన చేసిన బాలీవుడ్.. ఇప్పుడు తలవంచాల్సిన పరిస్థితి.
మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి షూటింగ్ ప్లాన్ చేంజ్..ఎప్పుడంటే??
దీంతో చాలావరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా హీరోలు సౌత్ తో కలిసి పని చేస్తున్నారు. అంతేకాదు దక్షిణాది సినిమా రంగానికి చెందిన హీరోలతో సైతం బాలీవుడ్ హీరోలు నటించడానికి ముందుకు వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మధ్య ఎటువంటి పోటీ వాతావరణం లేకుండా చాలా వరకు తెలివిగా ఒకపక్క జక్కన్న మరోపక్క చిరంజీవి తమదైన శైలిలో రాణిస్తున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళ్తే ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘లాల్సింగ్ చద్దా’ స్పెషల్ ప్రీమియర్ షో చిరంజీవి ఇంటిలో వేయడం తెలిసిందే.
ఈ షోనీ అమీర్ ఖాన్ తో పాటు నాగచైతన్య, చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, సుకుమార్ చూడటం జరిగింది. షో చూసిన వెంటనే స్వయంగా చిరంజీవి తెలుగులో తన సమర్పణలో ‘లాల్సింగ్ చద్దా’ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరోపక్క రణబీర్ సింగ్ సినిమా “బ్రహ్మాస్త్ర” ని రాజమౌళి తెలుగులో విడుదల చేసే బాధ్యతను తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఇటీవల పాల్గొనడం తెలిసిందే. ఈ రీతిగా రాజమౌళి మరియు చిరంజీవి సమర్పణలో రెండు బాలీవుడ్ సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి.