సీజన్ మారింది అంటే చాలు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే వాటిలో జలుబు, దగ్గు ముందుంటాయి.. ఇక వర్షాకాలంలో సర్వసాధారణంగా జలుబు, పడిసంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉంటారు.. వైద్యశాస్త్రంలో జలుబుకు మందును ఇప్పటివరకు కనుగొలేదు.. వాస్తవానికి జలుబుకి ఎటువంటి మందులు అవసరం లేదు.. కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి దానంతట అదే తగ్గిపోతుంది.. జలుబు నుంచి సత్వర ఉపశమనాన్ని ఇచ్చేది ఆవిరి పట్టడం.. అందుకే మనలో చాలామంది వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడతారు.. కానీ దీనికంటే జలుబు నుంచి ఫాస్ట్ గా రిలీఫ్ ని ఇచ్చేది పుదీనా ఆవిరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!
పుదీనా ఆకులలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, డి, ఇ, డి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి అందులో పుదీనా ఆకులు వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది..
జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు వేడినీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టి చూడండి. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి.. గాలి పీల్చడనికి ఇబ్బంది ఉండదు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నశింప చేస్తుంది..