ఈ మధ్యకాలంలో కల్పిత కథల కంటే బయోపిక్ల నిర్మాణానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. రాజకీయ రంగం, క్రీడారంగం.. ఇలా అనేక రంగాలకు చెందిన జీవిత కథలను సినిమాలుగా తీస్తున్నారు. ఇప్పుడు మరో బయోపిక్ మన ముందుకు రాబోతోంది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇద్దరు మహిళా షూటర్లు చంద్ర, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా ‘సాండ్ కీ ఆంఖ్’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ‘వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు’ అనే క్యాప్షన్ ఈ సినిమా పోస్టర్లో హైలైట్గా నిలుస్తోంది. తుషార్ హీరానందని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్ దాదీస్’గా మంచి పేరుంది. వీరి పాత్రల్లో తాప్సి, భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు. ఈ షూటర్ దాదీస్ గురించి తెలుసుకోవడానికి తాప్సి, భూమి వారి స్వస్థలమైన బాగ్పట్ జిల్లాకు కూడా వెళ్లారు. కొన్ని రోజులు వారి ఇంట్లోనే ఉండి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. అవన్నీ సినిమాకు ఉపయోగపడ్డాయని తాప్సి, భూమి తెలిపారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
previous post
next post