ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్న్యూస్ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది.
పైగా కెరీర్ స్టార్టింగ్లో సన్నగా ఉన్న నమిత.. కొన్నాళ్లకు బొద్దుగా మారిపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వివాహం అయిన ఐదేళ్లకు గర్భం దాల్చిన నమిత.. మే నెలలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రివిల్ చేసింది.
అయితే తాజాగా ఆమె ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేడు నమిత అందరికీ తెలియజేసింది. తాను కవలలకు జన్మనిచ్చానని, ఇద్దరూ మగ పిల్లలే అని చెప్పుకొచ్చిన నమిత.. మీ అందరి బ్లెస్సింగ్స్ తన పిల్లల పై ఉండాలని కోరుకుంది. అలాగే డెలివరీ టైంలో తనకు రేలా హాస్పిటల్ సిబ్బంది అందించిన సర్వీస్ చాలా బాగుందంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ఈ మేరకు ఓ వీడియోను ఇన్స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఈ వీడియో నమిత, ఆమె భర్త వీరేంద్ర చౌదరి చెరో బిడ్డని ఎత్తుకుని ఉన్నాయి. అయితే వారి ఫేస్లు మాత్రం నమిత రివిల్ చేయలేదు.
https://www.instagram.com/reel/ChcHIn-jTz1/?utm_source=ig_web_copy_link
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!