మాచర్ల యంగ్ స్టార్ నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాగే కేథరిన్ థ్రెసా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఆగస్టు 12న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అభిమానులు కూడా పరమ రొటీన్ సినిమా అంటూ పెదవి విరిచారు. పైగా అప్పటికే బరిలో ఉన్న `బింబిసార`, `సీతారామం` బాక్సాఫీస్ వద్ద నయా వసూళ్లను రాబడుతుండటం, ఆగస్టు 13న విడుదలైన `కార్తికేయ 2` హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. వీటి మధ్య నితిన్ సినిమా బాగా నలిగిపోయింది.
దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. వరల్డ్ వైడ్గా రూ. 21.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే విడుదలైన పది రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.11 కోట్ల షేర్ వసూల్ చేయగలిగింది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 10.01 కోట్ల షేర్తో సరిపెట్టుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇంకా రూ. 11.99 కోట్ల షేర్ను వసూల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఆ టార్గెట్ దరి దాపుల్లోకి కూడా వెళ్లడం కష్టమే అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ ద్వారా నితిన్ ఖాతాలో మరో బిగ్ డిజాస్టర్ వచ్చి పడింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!