టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరో సారి విరుచుకుపడ్డారు. వీరి నాటకాలు ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారనీ, ప్రజలను రెచ్చగొట్టేందుకు అమరావతి పేరుతో యాత్రలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గుడివాడలో మీడియా సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పరిపాలనా రాజధానిని అడ్డుకునేందుకు విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ ఎల్లో మీడియా దుప్ప్రచారాం చేస్తొందన్న కొడాలి నాని.. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాను పూర్తిగా బహిష్కరించాలనీ, ఆ పేపర్లు సెర్క్యులేట్ కాకుండా నిలుపుదల చేయాలని పిలుపునిచ్చారు.
రుషికొండను తవ్వేస్తున్నారంటూ గగ్గొలు పెడుతున్నారనీ, హైదరాబాద్ లో కొండలు తవ్వి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లు కట్టుకోలేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీపై తనకు అభిమానం లేదని స్పష్టం చేస్తూ హరికృష్ణ తనకు రాజకీయాల్లోకి తీసుకువచ్చారనీ, జూనియర్ ఎన్టీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని అన్నారు కొడాలి నాని. వీరిద్దరికీ తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని. జీవితంలో తోడు కోసమే లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారనీ, ఆమెకు ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కున్న చంద్రబాబు ఇప్పటికీ ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ క్షోభ పెడుతున్నారని దుయ్యబట్టారు.
తండ్రి చావుకు కారణమైన చంద్రబాబు ఫ్యామిలీతో షోలు చేయడానికి నందమూరి బాలకృష్ణకు సిగ్గు ఉండాలని ధ్వజమెత్తారు. పార్టీని కాపాడినట్లు షోలు చేస్తున్న చంద్రబాబు కపట నాటక సుత్రధారిగా అభివర్ణించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని నడపడం చంద్రబాబుకు చేతకాకపోతే బయటకు పోవాలన్నారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు కొడాలి నాని.
సీఎం జగన్ కీలక ఆదేశాలు .. ఆ కుటుంబాలకు రూ.2వేల తక్షణ సాయం