పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఇందులో రానా దగ్గుపాటి ఓ కీలక పాత్రను పోషించగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే భీమ్లా నాయక్ ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదట. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత నాగ వంశీ స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్స్టాపబుల్ 2`కి విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు నిర్మాత నాగ వంశీ కూడా వచ్చారు.
అయితే ఈ క్రమంలోనే `భీమ్లా నాయక్ సినిమా ఫస్ట్ ఛాయిస్ ఎవరు..?` అని ప్రశ్నించాడు బాలయ్య. అందుకు నాగ వంశీ బదులిస్తూ.. `మీరే సర్.. మేం మీ చుట్టూ తిరిగి, హీరోగా మిమ్మల్ని అడిగిన తరువాత సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుందని మీరే కదా సజెస్ట్ చేశారు` అంటూ సమాధానం ఇచ్చారు.
అదన్నమాట సంగతి.. మొదట భీమ్లా నాయక్ చిత్రాన్ని బాలయ్యతో చేయాలనుకున్నారు. కానీ బాలయ్య పవన్ కళ్యాణ్ ను సూచించారు. ఏదేమైనా బాలయ్య ఈ సినిమా చేసుంటే రచ్చ లెవెల్ లో ఉండేదని అంటున్నారు నందమూరి అభిమానులు.
https://newsorbit.com/trending/balakrishna-sensational-comments-on-his-wife-vasundhara.html
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!