డైరెక్టర్ అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పిట్టగోడ` అనే సినిమాతో దర్శకుడుగా కెరీర్ ను ప్రారంభించిన ఈయన `జాతిరత్నాలు` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. `జాతిరత్నాలు` సినిమాతో అనుదీప్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది.
ఈ సినిమా తర్వాత అనుదీప్ తమిళ హీరో శివ కార్తికేయన్ తో `ప్రిన్స్` అనే మూవీని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్ తనకు అరుదైన వ్యాధి ఉందంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు.
హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్ఎస్పీ) అనే వ్యాధితో అనుదీప్ బాధపడుతున్నాడట. తనకు గ్లూటెన్ పడదని, ఒకవేళ కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర పట్టదని, ఏదైనా జ్యూస్ తాగితే మైండ్ పని చేయడం ఆగిపోతుందని తెలిపారు. అలాగే ఈ వ్యాధి ఉన్నవారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్గా పని చేస్తాయని.. ఎక్కువ లైటింగ్ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చిన తాను తట్టుకోలేనని అనుదీప్ పేర్కొన్నాడు.
ఇక ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు త్వరగా అలిసిపోతారని, దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటూ ఉంటాను అని తెలిపారు. అంతేకాదు.. ఈ వ్యాధి పై త్వరలో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నట్లు అనుదీప్ పేర్కొన్నాడు. దీంతో ఈయన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
https://newsorbit.com/entertainment-news/the-director-who-beat-faria-abdullah.html
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!