అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ల కు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్ ను బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేసింది. పాదయాత్రపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో.. పార్టీలు కాని వారు పిటిషన్లు వేస్తే అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.
గుజరాత్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆప్ అధినేతకు షాక్ ఇచ్చిన సూరత్ (తూర్పు) అభ్యర్ధి కంచన్
థర్డ్ పార్టీ పిటిషన్ వేయడం న్యాయబద్దం కాదని పేర్కొంది. రైతాంగ సమాఖ్య తరపున పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లు కోరారు. మథ్యంతర దరఖాస్తులను కొట్టివేయడంతో .. రిట్ అప్పీల్ కు కూడా విచారణ అర్హత లేదని హైకోర్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్రలో అనుమతి తీసుకున్న 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలనీ, సంఘీభావం తెలిపేవాళ్లు రోడ్డుకు ఇరుపక్కలా ఉండి మద్దతు తెలియజేయవచ్చని సింగిల్ జడ్జి కోర్టు ఇంతకు ముందు ఆదేశాలు ఇచ్చింది.
అమరావతి నుండి అరసవెల్లి కి చేపట్టిన అమరావతి రైతుల పాదయాత్ర అమలాపురంలో నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆంక్షల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు అమరావతి రైతుల పరిరక్షణ సమితి నేతలు గతంలో వెల్లడించారు. హైకోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు తీసుకున్న తర్వాత పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారు. ఈ నేపథ్యం లో పాదయాత్రకు అనుమతులు రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఇంతకు ముందు హైకోర్టు కొట్టివేసింది.
ఆ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట .. విచారణకు సీఐడీకీ అనుమతి