ఏపి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. అయితే ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని ఖుద్దూస్ నగర్ లో పర్యటించిన సమయంలో అక్కడి ప్రజల మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కుండువా ధరించారు. అయ్యప్ప మాలాధారణలో ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇతర మతానికి చెందిన చిహ్నాలైన టోపీ, కుండువా ధరించడం వివాదాస్పదమైంది. అనిల్ కుమార్ చర్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
అనిల్ కుమార్ చర్యపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డిలు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువాలు వేసుకొని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు జీవీఎల్ నర్శింహరావు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యే శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు. ఇటువంటి ఓటుబ్యాంక్ రాజకీయాలు హిందువులు సహించరని సీఎం వైఎస్ జగన్ తెలుసుకోవాలని అన్నారు.
హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్ప మాలదీక్షను అవమానపరిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విష్ణువర్థన్ రెడ్డి. దీక్షాపరులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసిపి నేత బరితెగించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటివి హిందూ సమాజం క్షమించదని బీజేపీ హెచ్చరిస్తుందని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప దీక్షా ధారుడిగా ఉండి ముస్లిం టోపీ, కండువా వేసుకుని కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేశారు.
YSRCP: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పేసిన మరో సీనియర్ నేత
స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువాలు వేసుకొని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యే శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలి. ఇటువంటి ఓటుబ్యాంక్ రాజకీయాలు హిందువులు సహించరని సీఎం @YSJagan తెలుసుకోవాలి. pic.twitter.com/93fC3dCZuj
— GVL Narasimha Rao (@GVLNRAO) November 25, 2022