తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మైనంపాటి హనుమంతరావు నివాసంలో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సమావేశం ముగిసిన తర్వాత మైనంపాటి పార్టీలో పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము సమావేశం కావడానికి కారణం మంత్రి మల్లారెడ్డి వైఖరేనని స్పష్టం చేశారు. నిజాయితీగా పని చేస్తున్న కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతోందన్నారు. పని చేసే క్యాడర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పదవులు తీసుకున్న వారే మూడు, నాలుగు పదవులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
పార్టీలోని క్యాడర్ కు జరుగుతున్న ఇబ్బందులపై చర్చించేందుకు సమావేశం అయ్యామని మైనంపాటి తెలిపారు. ప్రస్తుత పార్టీ సిస్టమ్ లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరో ఒకరు బయటకు వచ్చి చెప్పకపోతే సమస్యలు అధిష్టానం దృష్టికి ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము సమావేశం నిర్వహించడం తప్పేమీ కాదనీ, ఈ సమస్యలపై మంత్రి కేటిఆర్ తో సమావేశం అవ్వాలని భావిస్తున్నట్లు గా తెలిపారు. మైనంపాటి నివాసంలో జరిగిన భేటీలో ఎమ్మెల్యే లు అరికపూడి గాంధీ, వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, బి సుభాష్ రెడ్డి హజరైయ్యారు. ఈ ఎమ్మెల్యేల అసంతప్తిపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ బిగ్ షాక్ .. రేపు మళ్లీ విచారణకు రావాలంటూ..