NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆరోపించిన వైసీపీ ఎంపీ విజయసాయి

ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యం వల్లే ఏపీకీ తీవ్ర అన్యాయం జరిగిందనీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆరోపించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో వైసీపీ తరపున ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనభా ప్రాతిపదికపై బీసీ లకు రిజర్వేషన్లు, చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు వంటి అంశాలపై ప్రసంగించారు. ఏపి విభజన అన్యాయంగా జరిగిందన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి బీల్లు పాస్ చేశారనీ, ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ కూడా మర్చిపోయిందని విజయసాయి విమర్శించారు.

YCP MP Vijaya Sai Reddy

 

పదేళ్లు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారనీ, అందుకు కాంగ్రెస్ కూడా అంగీకరించిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పార్టీలు వస్తుంటాయి,  పోతుంటాయి .. కానీ ప్రభుత్వం అనేది కొనసాగింపు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని విజయసాయి అన్నారు. ఇప్పటికైనా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసినందునే కాంగ్రెస్, బీజేపీలకు ఏపి ప్రజలు బుద్ది చెప్పారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనీ, బీజేపీకి అర శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెబుతోందనీ, కానీ ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పోరాటం కొనసాగి తీరుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు తీసుకువచ్చామనీ, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు చెప్పి తన పరిధిని అతిక్రమించిందని అన్నారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని పార్లమెంట్ లో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని హరించే అధికారం లేదని అన్నారు విజయసాయి రెడ్డి.

రాజధాని అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమనీ, రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలనేది రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయని విజయసాయిరెడ్డి తెలిపారు. యూపీ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలను ఉదాహరణగా ప్రస్తావించారు విజయసాయి రెడ్డి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సెక్రటేరియట్ లక్నోలో ఉంటే అలహాబాద్ లో హైకోర్టు ఉందని అన్నారు. మరి ఏపి విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. వైజాగ్ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని అన్నారు. ఏపిపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డి.

YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju