Krishna Mukunda Murari December 29th Episode: మురారి కృష్ణ భుజం మీద చెయ్యి వేసి తన ఇంటి వరకు జాగ్రత్తగా నడిపించుకుని తీసుకుని వస్తాడు. నీ కాలు బెణికింది కదా, నీ కాలు చూపించు అని అయింటమెంట్ తీసి తన కాలికి రాసి మసాజ్ చేస్తాడు. ఏంటి ఏసిపి సార్ ఇది అని కృష్ణ అంటే, నాకు రేపు గాయం అయితే ఇలానే వదిలేస్తావా నన్ను కాదు కదా, సైలెంట్ గా ఉండు అని మసాజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు పెయిన్ తగ్గుతుంది అని మురారి అంటాడు. కృష్ణ ని రెస్ట్ తీసుకో మని చెప్పి మురారి ఇంటికి వెళ్తాడు.
పెద్దమ్మ నిన్ను రమ్మని పిలిచింది నాన్న అని రేవతి చెబుతుంది. త్వరగా ఇల్లు మురారి అమ్మకి మళ్ళీ కోపం వస్తుంది నువ్వు ఇంకా ఆ కృష్ణ దగ్గరే ఉన్నావేమో తనకి సేవలు చేస్తూ కూర్చున్నావేమో అని అనుకుంటుంది అని నందిని చెబుతుంది. నాన్న మురారి ఈ కేసు విషయం ఏమైందో నాకు తెలియదు. నాకున్నది ఒకే ఒక్క కోరిక నా కృష్ణ నే నువ్వు మళ్ళీ నా కోడలిగా నాకు తిరిగి ఇవ్వాలి. ఇదొక్కటే చెయ్యి చాలు నాన్న నాకు అని రేవతి అంటుంది సరే అమ్మ తప్పకుండా చేస్తాను అని చెప్తాడు.
భవాని మురారి ని హాస్పిటల్ లో చూడటానికి వెళ్ళినప్పుడు ప్రభాకర్, కృష్ణ మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. మురారి భవాని దగ్గరకు వెళ్తాడు పెద్దమ్మ రమ్మని పిలిచారు అంట అని మురారి అడుగుతాడు. అప్పటికే భవాని తన కళ్లనిండా కన్నీళ్లు కుక్కుకొని ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ ఎందుకు ఏడుస్తున్నారు అని మురారి అడుగుతాడు. ఏంటి నాన్న ఈ ఒక్క రోజే నేను ఏడుస్తున్నానా, కొన్ని రోజుల నుంచి నువ్వు నన్ను ఇలానే చూస్తున్నావు కానీ, నీకు అర్థం కావడం లేదా.. నిన్ను చిన్నప్పటినుంచి నేనే పెంచాను. నీకు ఏ లోటు రాకుండా చూసుకున్నాను కానీ, నువ్వు ఈ లోకంలో లేవని తెలిసినా తర్వాత ఈ గదిలో ఒంటరిగా కూర్చుని ఎన్ని రాత్రులు వెక్కి వెక్కి ఏడ్చానో నీకు తెలియదు. సరిగ్గా అదే సమయంలో ముకుందా వచ్చి నువ్వు బ్రతికున్నావని చెప్పింది. నువ్వు చనిపోయావు అన్న నిజాన్ని మర్చిపోయి నువ్వు బ్రతికే ఉన్నావు అన్న ఆశ కల్పించింది. అంతేకాదు తనే హాస్పిటల్ కి తీసుకువచ్చి నిన్ను మళ్ళీ మా అందరినీ కలిపింది. అప్పుడే ముకుందపై అంతకుముందు ఉన్న ఇష్టం కంటే కూడా ఆ తర్వాత నుంచి తన మీద ఎక్కువ ప్రేమ కలిగింది. అలాంటి అమ్మాయికి నిన్ను మళ్ళీ తిరిగి ఇచ్చి పెళ్లి చేయాలని అనిపించింది. ఆ కృష్ణ వాళ్లే ఇదంతా చేశామని నా కళ్ళముందే ఒప్పుకున్నారు. అప్పటినుంచి నాకు ముకుందాను నీకిచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయించుకున్నాను అని భవాని తన మనసులో ఉన్న మాటని మురారితో చెబుతుంది.
పెద్దమ్మ ఈ కేసు విషయంలో కృష్ణ వాళ్ళు నిర్దోషి కాదు అనే విషయాన్ని మీకు నేను నిరూపించి తీరుతాను. కాసేపట్లో స్కెచ్ వేసే అతను వస్తాడు కదా, అతనే బొమ్మ గీస్తడు దాన్ని బట్టి నిజానిజాలు తెలిసిపోతాయి అని మురారి అంటాడు. అంటే అతను స్కెచ్ గీస్తే సరిపోతుందా.. ఇక కృష్ణ చేయలేదని నిరూపిస్తావా ఇదే సరిపోతుందా అని భవాని అంటుంది. నేను నీ కొడుకుని పెద్దమ్మ నీ పెంపకంలో పెరిగాను. అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చేయను. ఈ కేసులో నిజానిజాలు తేలే వరకు కృష్ణతో మంచిగా ఉండండి. ఆ తరువాత కృష్ణ తప్పు చేయలేదన్న నిజం తెలిసిన తర్వాత మీరు తనకి ముఖాన్ని కూడా చూపించుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి అని మురారి అంటాడు. బాగుంది మురారి చాలా బాగుంది నువ్వు ఇప్పటికి తనకే సపోర్ట్ చేస్తున్నావా అని భవాని అంటుంది. లేదు పెద్దమ్మ నిజాన్ని చాలు తెలిసే వరకు ఎవ్వరి మీద నింద వేయకూడదు అని అంటున్నాను అని మురారి అంటాడు.
కృష్ణ కాలికి గాయమైంది కదా నందిని వెళ్లి తమలపాకు తీసుకురా దానికి కాల్చి నూనె రాసి కట్టు కడితే కృష్ణ కాలి నొప్పి తగ్గుతుంది. త్వరగా గాయం మానిపోతుంది అని రేవతి అంటుండగా.. అటు చూడండి చిన్నమ్మ అని నందిని అటుగా వస్తున్న కృష్ణ వైపు చూపిస్తుంది. సరిపోయింది అని ఇద్దరు అనుకుంటారు. ఏంటి అత్తయ్య ఏమైంది నా గురించేనా అని అనుకుంటారు అంటుంది. పెద్ద అత్తయ్య మురారిని పిలిచింది ఏం మాట్లాడుతుందో ఏమో అని కంగారు పడుతున్నాము అని రేవతి అంటుంది. భవాని మురారి కి ఎలా క్లాస్ పీకుతుందో కృష్ణ యాక్టింగ్ చేసి చూపిస్తుంది. కృష్ణ యాక్టింగ్ చూసి రేవతి, నందిని ఇద్దరు పకపకా నవ్వుకుంటారు. అప్పుడే అక్కడికి దేవ్ వస్తాడు. మీరు ఏం జోక్ చెప్పి నవ్వుకుంటున్నారు నాకు చెప్తే నేను నవ్వుతాను కదా అని దేవ్ అంటాడు. అప్పుడే కిట్టమ్మా అని దేవ్ కృష్ణని పిలుస్తాడు. కిట్టమ్మా ఇలా నన్ను మా నాన్న చిన్నాన్న మాత్రమే పిలుస్తారు. ఇంత మంచిగా ఉన్న దేవ్ ని మధు ఎందుకు విలన్ లాగా ఊహించుకున్నాడు అని కృష్ణ మనసులో అనుకుంటుంది. దేవ్ చాలా మంచి వాడు అని రేవతి మనసులో అనుకుంటుంది.
రేపటి ఎపిసోడ్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడతారు. అత్తయ్య పెద్ద అత్తయ్య ఎక్కడ అని కృష్ణ అడుగగా.. కొందరు ఉంటే పెద్దత్తయ్య రారని నీకు తెలుసు కదా అని ముకుందా అంటుంది. అప్పుడే కృష్ణ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. పెద్దమ్మ వస్తుంది. పెద్దమ్మ పక్కన అటు ఇటు చైర్స్ కాళీ ఉండేలాగా చేయమని, తన పక్కన మనం ఇద్దరం కూర్చుందం అని మురారి చెబుతాడు. ఇక అలాగే కృష్ణ అందరి ప్లేసెస్ మార్చుతుంది. మొత్తానికి భవనిని తీస్కుని వస్తాడు. మురారి చెప్పినట్టుగానే భవానికి అటుపక్క ఇటుపక్క రెండు కుర్చీలు ఖాళీగా ఉంటాయి. చూస్తావేంటి కృష్ణ కూర్చొని అంటాడు. కృష్ణ కూర్చున్న తర్వాత భవాని కావాలని కోపంగా కృష్ణ అని అరుస్తుంది అది ఎందుకో తరువాయి భాగంలో చూద్దాం.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?