ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోన్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలో టిక్కెట్ల గోల మొదలైంది. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్న ఊహల్లో మునిగి తేలుతోన్న పార్టీ నేతలు ఎవరికి వారు సీటు తెచ్చుకున్నోడు లక్కీయే అంటున్నారు. అందుకే ఒక్కో ఫ్యామిలీ ఏకంగా రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ లిస్టులో పరిటాల ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ, కోట్ల ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీ, చింతకాయల ఫ్యామిలీ, పూసపాటి ఫ్యామిలీ ఉన్నాయి.
వీరంతా తమ ఫ్యామిలీలకు రెండేసి సీట్లు అడుగుతున్నారు. వీరిలో చాలా మంది గత ఎన్నికల్లో రెండేసి సీట్ల మీద పోటీ చేసిన వారే. పూసపాటి, కేఈ, కోట్ల, పూసపాటి ఫ్యామిలీల నుంచి ఇద్దరిద్దరు గత ఎన్నికల్లోనే పోటీ చేశారు. వీరంతా ఓడిపోయిన వారే. అయితే ఒక్క కింజారపు ఫ్యామిలీ మాత్రమే ఇందుకు మినహాయింపు. ఈ ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ముగ్గురు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, రామ్మోహన్ నాయుడు ముగ్గురు విజయం సాధించారు.
ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి గత ఎన్నికల్లో ఆరుగురు మూడు పార్టీల నుంచి పోటీ చేస్తే ఇద్దరు గెలిచి.. నలుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి, వైసీపీ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన బాలయ్య చిన్నల్లుడు భరత్, మంగళగిరిలో లోకేష్ నలుగురు ఓడిపోయారు. ఇక గెలిచిన వారిలో హిందూపురంలో బాలయ్య, కుప్పంలో చంద్రబాబు మాత్రమే ఉన్నారు.
ఇక ఇప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీ నుంచే ఏకంగా ఐదుగురికి సీట్లు ఖరారయ్యే పరిస్థితి ఉంది. అసలే పొత్తులో చాలా మంది నేతల సీట్లు గల్లంతవుతున్నాయి. అలాంటి టైంలో నందమూరి ఫ్యామిలీ త్యాగాలు చేయకుండా వాళ్లకు కావాల్సినన్ని సీట్లు తీసేసుకుని.. మిగిలిన నేతలను త్యాగాలు చేయాలంటే ఎంత వరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సారి కూడా మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలయ్య, విశాఖ ఎంపీగా భరత్ పోటీ చేస్తున్నారు.
ఈ నలుగురితో పాటు బీజేపీతో పొత్తు ఉంటే చంద్రబాబు వదిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కూడా రాజమహేంద్రవరం లేదా మరోచోట ఎంపీగా పోటీ చేయడం ఖరారైనట్టే..! ఇదే ఇప్పుడు టీడీపీ నేతల్లో ముసలానికి కారణమైంది. మరి ఈ ముసలం పార్టీలో ఎంత వరకు వెళుతుందో ? చంద్రబాబు రెండు సీట్లు అడుగోతన్న ఫ్యామిలీలను ఎలా మ్యానేజ్ చేస్తారో ? చూడాలి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!