Samantha: 2011వ సంవత్సరంలో “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా సమంత సినిమాలో ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న సమంత అతి తక్కువ సమయంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది. తెలుగులో మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇంకా చాలామంది టాప్ హీరోలతో నటించింది. ఒక తెలుగులో మాత్రమే కాదు సౌత్ లో అనేక భాషలతో పాటు హిందీలో కూడా అవకాశాలు అందుకుంది. 2017లో అక్కినేని నాగచైతన్యనీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరించింది.
పరిస్థితి ఇలా ఉంటే అనూహ్యంగా 2021లో సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం అందరికీ షాక్ గురి చేసింది. ఆ తర్వాత ఏడాది సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం జరిగింది. ఈ క్రమంలో దాదాపు ఆరు నెలలు పాటు హాస్పిటల్ కి పరిమితమై సినిమాలకు దూరమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రాణాంతకరమైన వ్యాధి కావటంతో చాలా బలమైన ట్రీట్మెంట్ కోసం సినిమా షూటింగ్స్ ఆపేసింది. ఆ సమయంలో సమంత చామింగ్ మొత్తం మొహంలో కోల్పోయింది. కానీ ఆరు నెలలలోనే కోలుకొని తరువాత… సినిమాలు చేయటం ప్రారంభించింది. ఈ రకంగా ఒకపక్క వ్యక్తిగతంగా జీవితంలో అనేక కష్టాలు మరోపక్క కెరియర్ పరంగా ఇబ్బందులు హెల్త్ పరంగా ఎత్తుపల్లాలు చూసిన సమంత ఇప్పుడు పాడ్ కాస్ట్ కి రెడీ అవుతుంది.
తన జీవితంలో నేర్చుకున్న అనుభవాలు ఇంకా అనేక విషయాలు తెలియజేయడానికి సిద్ధమవుతోంది. పాడ్ కాస్ట్ ద్వారా తన అనుభవాలను..ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలు పంచుకునేందుకు రికార్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఫోటోని పోస్ట్ చేసి పాడ్ కాస్ట్ నూతన అనుభవాలు తెలియజేస్తున్నట్లు సమంత పేర్కొంది. ఇందుకోసం చిన్నప్పుడు సిలబస్ కి మించి పుస్తకాలు చదివేదాన్ని. ఏ సబ్జెక్టులోనైనా లీనమవటం.. దాని గురించి పరిశోధించడం నాకు ఇష్టం. చాలాకాలం తర్వాత మళ్లీ నేను నన్ను కనుగొంటున్నాను. నా పుస్తకాలు నిండిపోయాయి ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని భావిస్తున్నాను అంటూ పాడ్ కాస్ట్ గురించి సమంత పోస్ట్ పెట్టడం జరిగింది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?