London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధిని చేసితా కొచర్ దుర్మరణం పాలయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీహెచ్డీ చేస్తున్న కోచర్ వర్శిటీ నుండి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురైయ్యారు. ఆమె సైకిల్ పై వెళుతుండగా, ట్రక్ ఒకటి ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో కొచర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్ కొద్ది దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందారు.
చేసితా ఆకస్మిక మరణంపై ఆమె తండ్రి, విశ్రాంత లెప్టినెంట్ జనరల్ ఎస్ పీ కొచ్చర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చేసినా మరణం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కలచివేసింది. అత్యంత ప్రతిభావంతురాలైన చేసితా మరణంపై సన్నిహితులు, సహ విద్యార్ధులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయాన్ని భారత్ తీసుకువచ్చేందుకు తండ్రి ఎస్పీ కొచర్ లండన్ చేరుకున్నారు.
కాగా, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసితా కొచర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చేసితా కొచర్ ఆకాల మరణంపై సంతాపం ప్రకటించిన ఆయన ఆమె నీతి ఆయోగ్ లో తనతో కలిసి పని చేశారని, ధైర్య వంతురాలని గుర్తు చేసుకున్నారు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానన్నారు.
గురుగ్రామ్ లో నివాసముండే చేసితా కొచర్ .. సెప్టెంబర్ లోనే పీహెచ్డీ కోసం అక్కడకు వెళ్లారు. గతంలో ఆమె ఢిల్లీ విశ్వ విద్యాలయం, అశోక యూనివర్శిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వ విద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2021 – 23 మధ్య నీతి ఆయోగ్ లోని నేషనల్ బిహేవియరల్ ఇన్ సైడ్స్ యూనిట్ లో సీనియర్ సలహాదారుగా సేవలందించారు.
అంతే కాదు ఆధార్ ప్రాజెక్టు వ్యవస్థాపక బృందంలో ఒకరు కూడా. సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియర్ ఛేంజ్ లో పని చేస్తుండగా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ తో కూడా కలిసి పని చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చేరిన కొచర్ కు నాలుగేళ్ల పీహెచ్డీ కోర్సుకు పూర్తి స్థాయి స్కాలర్ షిప్ లభించడం గమనార్హం.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!