అమరావతి: వైసిపి నాయకత్వం నుంచి తనకేమీ పిలుపు రాలేదన్న నగరి శాసనసభ్యురాలు రోజా సాయంత్రానికి మాత్రం మీడియా రిపోర్టు చేసినట్లుగానే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఈ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకు రెండవ విడతలో మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలిస్తోంది.
జగన్ దగ్గరకు వెళ్లేముందు రోజా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని కలుసుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆయన ముందు వాపోయినట్లు తెలిసింది.
జగన్ను కలిసిన తర్వాత రోజా మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్తులో మంత్రి వదవి దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పదవి రాలేదని తాను అలిగినట్లు జరుతున్న ప్రచారం గురించి ప్రస్తావిస్తూ, వైసిపిలో అలగడాలు, బుజ్జగింపులు ఉండవని ఆమె అన్నారు.