(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇరాన్ తీరానికి దగ్గరలో ఒమన్ సింధుశాఖలో అంతుచిక్కని రీతిలో జరిగిన సంఘటనలో రెండు ఆయిల్ ట్యాంకర్లు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. వాటిలోని సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకారు. జరిగింది ప్రమాదమేననీ, తమ నౌకాదళం 44 మంది సిబ్బందిని కాపాడిందనీ ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆయిల్ రవాణాకు కీలకమైన గల్ఫ్లో ఇలాంటి సంఘటన జరగడం గత కొద్ది వారాలలో ఇది రెండవసారి. గత నెలలో ఇక్కడే ఒక ఆయిల్ ట్యాంకర్పై దాడి జరిగింది. దానికి బాధ్యత ఇరాన్దేనని అమెరికా ప్రకటించింది. ఇప్పుడు కూడా రెండు ట్యాంకర్ల నుంచీ తమకు దాడి జరిగినట్లే సమాచారం వచ్చిందని అమెరికా నౌకాదళం పేర్కొన్నది. ఈ సంఘటన ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో అయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.