అమరావతి: ప్రజల విశ్వాసం ఎందుకు పొందలేకపోయామన్న ఆత్మవిమర్శ చంద్రబాబు ఎప్పుడూ చేసుకోలేదని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు నైజం ‘కుక్క తోక వంకరే’ అన్న సామెత మాదిరిగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
2004,2009 ఎన్నికల్లోనూ పరాజయం పాలైనప్పుడు కూడా ఇలాగే మాట్లాడారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఓడి నందుకు ప్రజలను తప్పుపట్టారు తప్ప వారి విశ్వాసం ఎందుకు పొందలేకపోయాం అనే అత్మవిమర్శ ఎప్పుడూ చేసుకోలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఎందుకు ఓడామో
అంతుబట్టడంలేదంటున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
2018 ఫిబ్రవరిలో విశాఖలో అట్టహాసంగా జరిపిన పార్టనర్షిప్ సమిట్లో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై సంతకాలు జరిగాయని చంద్రబాబు ప్రకటించారనీ, వంద కోట్ల వృధా ఖర్చు తప్ప రూపాయి పెట్టుబడి కూడా రాలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఐదేళ్లు ప్రజలను ఇలాగే మభ్యపెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు.