అమరావతి: వారిద్దరు రాజకీయ ప్రత్యర్థులు. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ లాబీలో ఆ ఇద్దరు నేతలు ఎదురుపడిన సమయంలో పలకరించుకొని కరచాలనం చేసుకోవడం అక్కడ ఉన్న వారంతా ఆసక్తిగా గమనించారు.
వారు ఎవరో కాదు టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్, మంగళగిరి నియోజకవర్గం నుండి లోకేష్పైనే ఘన విజయం సాధించిన వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలు.
ఈ ఆసక్తికర సన్నివేశం మంగళవారం శాసనసభ లాబీలో చోటుచేసుకుంది.
నారా లోకేష్ టిడిఎల్పి కార్యాలయం వైపు వెళుతుండగా ఎదురుపడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పలకరించారు. ఇద్దరు నమస్కరించుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. ఆళ్లకు లోకేష్ కంగ్రాట్స్ చెప్పగా, ప్రతిగా ఆళ్ల లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు.