కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ను పొందింది. సినిమా వ్యవథి 155 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఫైనల్ కాపీని లాక్ చేసి ఓవర్ సీస్ సహా అప్ లోడ్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. సమంత అక్కినేని అతిథి పాత్రలో కనిపించనుంది. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేశ్, వెన్నెలకిశోర్ తదితరులు కీలక పాత్రధారులు. ఆగస్ట్ 9న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.