(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో రెండవ దఫా చర్చలకు ముందు శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అరగంట సేపు మాహాబలిపురం బీచ్లో చెత్త ఏరుతూ గడిపారు. సముద్రపు ఒడ్డున ఉన్న తాజ్ ఫిషర్మాన్స్ కోవ్ హోటల్లో మోదీ బస చేశారు. ఆ హోటల్ ఎదురుగా ఉన్న బీచ్లో చెత్తాచెదారం ఏరుతుండగా తీసిన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు
https://twitter.com/narendramodi/status/1182863814217420806?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1182863814217420806&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fwatch-pm-modi-goes-plogging-on-mamallapuram-beach-before-meet-with-xi-2115595
‘నేను ఏరిన చెత్తను హోటల్ ఉద్యోగి జయరాజ్కు అందించాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ‘బహిరంగ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేట్లు చూడండి. అలాగే శారీరకంగా ధృడంగా ఉండండి’s అని కూడా ఆయన ట్వీట్ చేశారు.
Refreshing walk and exercises in Mamallapuram, along the scenic coast. pic.twitter.com/UjUq8FbVAv
— Narendra Modi (@narendramodi) October 12, 2019
తాను బీచ్లో నడుస్తుండగా, వ్యాయామం చేస్తుండగా తీసిన కొన్ని ఫొటోలను కూడా మోదీ ట్వీట్ చేశారు. చైనా అధ్యక్షుడితో ప్రధాని ఈరోజు ఏకాతంగా చర్చలు జరుపుతారు. తర్వాత రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య చర్చలు జరుగుతాయి. అనంతరం జిన్పింగ్కు ప్రధాని మధ్యాహ్న భోజనం ఆతిధ్యం ఇస్తారు.