(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధిక సార్లు విదేశీ పర్యటనలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గత ఐదేళ్ల మోదీ పర్యటనల కంటే మన్మోహన్ ప్రధానిగా ఉన్న ఐదేళ్లలో ఎక్కువ స్లారు విదేశీ పర్యటనలకు వెళ్లారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ‘ మోదీ అధికంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. మన్మోహన్ ఐదేళ్ల పాలన, మోదీ ఐదేళ్ల పాలనతో పొలిస్తే.. మోదీ కంటే మన్మోహన్ ఎక్కువ స్లారు విదేశీ పర్యటనలు చేశారు’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు
సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన పలు ఫొటోలను ఆల్బమ్ రూపంలో డిజైన్ చేసిన కాంగ్రెస్.. తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో చాలా వరకు మోదీ విమానం నుంచి దిగుతూ అభివాదం చేస్తున్నా ఫొటోలే ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు ప్రధానుల విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.
మోదీ, మన్మోహన్ సింగ్ ల పర్యటనకు సంబంధించిన వివరాలు
మోదీ తొలిసారి అధికారం చేపట్టిన తర్వాత 2014 -19 మధ్య 49 విదేశీ పర్యటనలకు వెళ్లారు. 2014 జూన్ లో మోదీ తొలిసారిగా భూటాన్ పర్యటనకు వెళ్లగా… 2019 ఫిబ్రవరిలో చివరిసారిగా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. అయితే, గత ప్రధాని మన్మోహన్ సింగ్ 2004-2009 మధ్య కాలంలో 29 దేశాల్లో 35 సార్లు పర్యటించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ తొలిసారి 2004 జులైలో థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లగా.. చివరి సారిగా 2009లో యూకేలో జరిగిన జీ 20 సదస్సుకు వెళ్లారు. ఇక 2009 -2014 మధ్య కాలంలో మన్మోహన్ మొత్తం 55 విదేశీ పర్యటనలు చేశారు. మన్మోహన్ సింగ్ పదేళ్లలో 93 దేశాల్లో పర్యటనలు చేశారు. కానీ మోదీ 2014-19 మధ్య ఐదేళ్ల కాలంలో 59 దేశాల్లో పర్యటనలకు వెళ్లారు. మొత్తం మీద గత ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన పర్యటనల కంటే మోదీ పర్యటనలు ఎక్కువగా ఉన్నాయి. పీఓంఓ వెల్లడించిన వివరాలే ఇందుకు సాక్ష్యం. దీన్ని బట్టి చూస్తే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తప్పు అని రుజువు అవుతున్నాయి.
ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో