అమరావతి: ఆంధ్రప్రదేశ్లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి, విగ్రహాలను తొలగిస్తున్నారని కన్నా విమర్శించారు. గత ప్రభుత్వం ఇదే విధంగా చేయడం వల్ల అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి తాము వ్యతిరేకం కాదనీ, అయితే తెలుగు మాథ్యమాన్ని కొనసాగించాలనీ కన్నా విజ్ఞప్తి చేశారు.
previous post