న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కుదరదని అఖిల భారత హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా తెలిపారు. ఆదివారం లక్నోలో జరిగిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశంలో అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయంచారు.
దీనిపై సిన్హా మాట్లాడుతూ కేవలం కక్షిదారులకు మాత్రమే రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందని అన్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సుప్రీం తీర్పును తప్పుబడుతున్నారని ఆయన అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సుప్రీం తీర్పుల ఏం తప్పు కనిపిస్తోందో అర్థం కావడం లేదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారమే సుప్రీం తీర్పు వెలువరించిందని ఆయన పేర్కొన్నారు.