తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ను హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. అచెన్నాయుడి తరపు న్యాయవాది హైకోర్టులో అచ్చెన్నాయుడు పరిస్థితి చాలా విషమంగా ఉందని… అతనిని తక్షణమే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా హైకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా కోర్టువారు అందుకు అంగీకరించలేదు. ఆ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది.
అలాగే అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ ల సహా మరో ముగ్గురు నిందితులను ఏసీబీ కస్టడీకి మూడు రోజుల అనుమతిని హైకోర్టు ఇవ్వడం గమనార్హం. అచెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి బాగా లేదు అంటున్నారు కాబట్టి అతనిని ఆస్పత్రిలోనే న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ అధికారులు విచారణ జరపాలని కోర్టువారు ఆదేశించారు.
ఇక అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడ్డంపెట్టుకుని ఎలాగైనా ఈ కేసును పక్కదారి పట్టించాలని చూసిన టిడిపి వారి ప్రయత్నాలకు హైకోర్టు గండి కొట్టింది అని వైసీపీ వర్గాల్లో ఆనందం మొదలైపోయింది. ఇదిలా ఉండగా ఎసిబి అధికారుల విచారణ లో ఏమేమి విషయాలు బయటికి వస్తాయి అన్న దానిపై ఆసక్తి నెలకొంది.