అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్లో ఒంటరి పోరుకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపి కాంగ్రెస్ ఇన్చార్జి ఉమెన్ చాందీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ మధ్య పొత్తులేనట్టేనని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఎపి కాంగ్రెస్ ఇన్చార్జి ఉమెన్ చాందీ రాహుల్తో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎపిలోని ప్రత్యేక పరిస్థితుల దృష్యా పొత్తు లేకుంటేనే మంచిదన్నయోచనకు వచ్చారు. జాతీయ స్థాయిలో అవగాహన కొనసాగించాలని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీలు నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికలలో మహాకూటమిలో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయి.