NewsOrbit
న్యూస్

ఊరువాడ కరోనా భయం మరో విధంగా కూడా..!

 

కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎదుటి వారితో కరచాలనం చేసినా, మాస్కులు పెట్టకుండా బయటికి తిరిగినా, భౌతిక దూరం పాటించక పోయినా ఇలా ఏవిధంగా అయినా కరోనా వ్యాపిస్తోందన్న ఆందోళన నేపథ్యంలో మానవాళి మొత్తం మాస్కులను అలవాటు చేసుకున్నారు. జన జీవనం కూడా స్వేచ్ఛ నశించింది. ఈ తరుణంలోనే కరోనా వ్యాప్తికి మరిన్ని కారణాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కరోనా భయం అలుముకుంది. కరోనాతో మరణించిన వారి అంతిమ క్రియలకు కొన్నిచోట్ల పోరు జరుగుతోంది. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరగడం ప్రభుత్వాన్ని కూడా ఒక రకమైన తలనొప్పిగా మారింది. తాజాగా ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కారణంగా మరణించినఒ వ్యక్తిని ఒంగోలు సమీపంలోని ఎరజర్ల అనే గ్రామం వద్ద దహన సంస్కారాలు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అడ్డుకుని నానా రభస చేశారు. ఇదే తరహాలో నిన్న కూడా కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఒ గ్రామంలో అడ్డుకున్నారు.

కరోనా తో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. మనం పోరాటం చేయాల్సింది రోగితో కాదు వ్యాధితో. వారిని వివక్షత చూడకండి అంటూ ఎవరికి ఫోన్ చేసినా మనకు ప్రస్తుతం ఇవే మాటలు వినిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవే సూచనలు చేస్తున్నాయి. కానీ మరణించిన రోగుల పట్ల మాత్రం మానవ జాతి వివక్ష చూపుతూనే ఉంది.వారిలోని కరోనా భయం, కరోనా పట్ల అప్రమత్తత, లేనిపోని రిస్క్ మనకు ఎందుకు అనే దీనిలో తమ సమీప పల్లెలో కూడా రానివ్వడం లేదు. దీంతో ఈ మృత దేహాలకు ఎక్కడ దహన సంస్కారాలు నిర్వహించాలన్న దానిపై అధికారులకు పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏపీ లో మొదట్లో పెద్దగా మరణాలు లేనప్పటికీ గడిచిన వారం రోజుల్లో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ముందు నుంచి మరణాల అనంతరం ఏం చేయాలనే దానిపై ఆలోచించని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మరణాలు పెరుగుతుండటంతో తలలు పట్టుకుంటుంది. గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, కడప తదితర జిల్లాలో ఈ సమస్య అధికంగా ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో యధాతధంగా నిర్వహించే మరుభూమిలో కాకుండా ఊరికి దూరంగా ప్రజాజీవనానికి బాగా దూరంగా ఈ సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోంది. కానీ వీటిని కూడా గ్రామస్తులు అడ్డుకోవడం ఒకింత ఆందోళన కరమైన అంశమే.

ఐసీఎంఆర్‌ నిబంధనలు ఇవి..

  • కరోనా సోకిన వ్యక్తులను అంత్యక్రియలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌ కొన్ని నిబంధనలను సూచించింది.
  • కోవిడ్‌తో మృతి చెందాడా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి.
  • ఆస్పత్రి వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే మృతదేహాన్ని ప్యాక్‌ చేయాలి. ముందుగా మృతదేహంపై సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం స్ప్రే చేసి, పాలిథిన్‌ కవర్‌తో భద్రంగా ప్యాక్‌ చేయాలి.
  • అంత్యక్రియలకు వెళ్లే ముందు బట్ట, లేదా తాడు సాయంతో మృతదేహాన్ని పాడె పైకి తరలించారు.
  • పాడెను మోసుకొని వెళ్లేవారు మృతదేహాన్ని తాకకుండా చూసుకోవాలి
  • 20 మందికి మించి అంత్యక్రియల్లో పాల్గొనరాదు. వీళ్లు కూడా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!