ఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్, ఎండి అరవింద్ జాదవ్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎయిర్ ఇండియా నియామకాల్లో జాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. కెప్టెన్ ఎ కథ్పాలియా, కెప్టెన్ అమితాబ్ సింగ్, కెప్టెన్ రోహిత్ భాసిన్, అప్పటి ఎయిరిండియా జనరల్ మేనేజర్లకు ప్రయోజనాలు చేకూర్చేలా జాదవ్ నియామకాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి.
జాదవ్తో పాటు ఎయిర్ ఇండియాతో మాజీ సీనియర్ ఉద్యోగులపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.