జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చేసిన తీవ్ర స్థాయి విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ వాడిన భాషలోనే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ను తాము ఆది నుండి ప్యాకేజీ స్టారేనని చెబుతున్నామనీ, ఇప్పుడూ కూడా అదే మాట చెబుతున్నామని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నామని ఆయన అన్నారు. పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని అంబటి విమర్శించారు. పవన్ విషయం రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనానికి కూడా అర్దమైపోయిందని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని చెప్పే నేతను పవన్ ను మాత్రమే చూస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ప్యాకేజీ స్టార్ కాకుండా సొంత స్టారా అని కూడా అంబటి అన్నారు.
వైసీపీకి, కాపు కులానికి మధ్య తగాదా పెట్టాలన్న తప్పుడు అలోచన తప్ప వేరే ఉద్దేశం లేదని పేర్ని నాని అన్నారు. పరుషమైన పదజాలంతో పవన్ ను విమర్శిస్తూ 2024 ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీని ఏమీ చేయలేరని అన్నారు. వైసీపీ లోని కాపు నాయకులు కూడా తిట్లు తిట్టగలరు, బూతులు మాట్లాడగలరని అన్నారు. వైసీపీ కాపులను దూరం చేసి చంద్రబాబుకు గుండుగుత్తగా అప్పగించాలన్నదే పవన్ ఉద్దేశమని ఆరోపించారు. పవన్ హెచ్చరికలకు వైసీపీలో దడిచేవాళ్లు ఎవరూ లేరని అన్నారు పేర్ని నాని. గుండాలు ఉన్నది జనసేనలో నే గానీ వైసీపీలో కాదని అన్నారు.
మంత్రులపై విశాఖలో జరిగిన దాడులను ఖండించాల్సింది పోయి చంద్రబాబు, పురందీశ్వరి, సీపీఐ రామకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడారు అంటేనే అర్ధం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబు డైరెక్టన్ లోనే, చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు పేర్ని నాని.
Pawan Kalyan: వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్