Chandrayaan-3: చంద్రాయన్-3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు భారత్ చేపట్టిన చంద్రాయన్-3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చంద్రయాన్- 3 ప్రయోగం సక్సెస్ కావటం పై సోషల్ మీడియాలో ఈశ్వర శాస్త్రవేత్తలను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. “ఇది భారత్ కు ప్రత్యేకమైన విజయం. చంద్రునిపై చంద్రాయన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినందుకు నాతో సహా దేశంలో ప్రతి పౌరుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు.
ఇస్రో బృందానికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు. “ఈ అపురూపమైన ఘట్టాన్ని శ్రీహరి కోటనుంచే సాధించాం. ఇది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకం” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. మొన్నటి వరకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన దేశాల లిస్టులో అమెరికా, యుఎస్ఎస్ఆర్, చైనా దేశాలు మాత్రమే ఉండగా ఇప్పుడు నాలుగో దేశంగా భారత్.. రికార్డు సృష్టించింది. ఇక ఇదే సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువం పై ల్యాండ్ అయిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రధాని మోదీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రాయన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో నా జీవితం ధన్యమైందని అన్నారు.
యావత్ దేశం గర్వించేలా శాస్త్రవేత్తలు విజయం సాధించారని కొనియాడారు. ఇది నవభారత విజయమని.. శుభాకాంక్షలు తెలియజేశారు. జోహన్స్ బర్గ్ నుండి వర్చువల్ గా పాల్గొని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు ల్యాండర్ నీ చేర్చిన మొట్టమొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈశ్వర శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఇంక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ రాష్ట్రపతి ముర్ము.. పలువురు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దేశం గర్వపడేలా చేశారని పేర్కొన్నారు.