ఏపి నూతన గవర్నర్ గా నియమితులైన సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుష్పగుచ్చం అందజేసి దుశ్సాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి, మండలి చైర్మన్ మోషేన్ రాజు, మంత్రి జోగి రమేష్, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న గవర్నర్ దంపతులకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. రాష్ట్ర మూడవ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం (24వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ గవర్నర్ గా సేవలు అందించిన బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్గడ్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి తదితరులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు బయటకు .. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ