రాష్ట్రంలో హోంగార్డులకు ప్రయోజనం కలిగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా పోలీస్ శాఖలో పని చేస్తున్న హోంగార్డులకు ఇప్పటి వరకూ తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఈ క్రమంలో హోంగార్డులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్ర చరిత్రలో మొదటి సారి పోలీస్ నియామకాాల్లో హోంగార్డులకు రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ నియామక ప్రక్రియ నిబంధనలు సవరించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కానిస్టేబుల్ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తారు.
సివిల్, ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్), ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతో పాటు పోలీస్ శాఖలో కమ్యూనికేషన్స్ ఫిట్టర్ – ఎలక్ట్రీషియన్, మెకానిక్స్ , డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్ కల్పించారు. సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా , పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు, కానిస్టేబుళ్ల నియామకాల్లో కేటరీల వారిగా 5 శాతం నుండి 25 శాతం వరకూ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హోంగార్డులకు గతంలో నెలకు 18వేలు మాత్రమే వేతనం ఉండగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్ లో జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వారి వేతనాలను రూ.21,300లకు పెంపు చేసింది. ఇప్పుడు వారికి మరింత మేలు చేకూర్చేలా కానిస్టేబుళ్ల భర్తీలోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. పోలీస్ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుండగా, అంతకు ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి గుడ్ న్యూస్ అందించినట్లు అయ్యింది.
YSRCP: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పేసిన మరో సీనియర్ నేత